నిజంనిప్పులాంటిది

Feb 14 2023, 11:01

యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి

•వెబ్‌సైట్‌లో ఈ-సేవలు

యాదగిరిగుట్ట: మొక్కు పూజల నిర్వహణలో భక్తుల ఆశయాలకు ఆటంకం కలగకుండా, భావాలను మరింత పెంచేలా విధానాలు అమలు కావాలన్న సీఎం దిశానిర్దేశంతో దైవదర్శనంతో పాటు నిత్య, వార, మాస, వార్షికోత్సవాలలో భక్తులు సులభంగా పాల్గొనేందుకు యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

బ్రహ్మోత్సవాల టికెట్లకు సైతం ఇబ్బందులు కలగకుండా అందుబాటులోకి తెచ్చారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరమయ్యాయి.

వెబ్‌సైట్‌లో ఈ-సేవలు

యాదాద్రిలో ఈ-సేవలను కూడా అందుబాటులో ఉంచారు. ‘యాదాద్రిటెంపుల్‌.తెలంగాణ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌లో ఈ సేవలను పొందొచ్చు. ఇందులో నిజాభిషేకం (ఇద్దరికి రూ.800, ఒక్కరికి రూ.400), సహస్రనామార్చన రూ.300, శ్రీ సుదర్శన నారసింహహోమం రూ.1,250, స్వామి వారి కల్యానం రూ.1,500, శయనోత్సవం రూ.100, స్వర్ణపుష్పార్చన రూ.600, సుప్రభాత దర్శనం రూ.100, దర్బార్‌ సేవ రూ.516, అష్టోత్తర ఘటాభిషేకం రూ.1000, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం రూ.800, స్కూటర్‌ పూజ రూ.300, ఆటో పూజ రూ.400, కారు పూజ రూ.500, బస్సు, లారీ, ట్రాక్టర్‌ పూజ రూ.1000, శాశ్వత నిత్యపూజ పదేళ్లకు రూ.15వేలు, శాశ్వత నిత్య సహస్రనామార్చన రూ.15వేలుగా నిర్ణయించారు. రాత్రి బసచేసే భక్తుల కోసం కొండ కింద గదులు ఉన్నాయి. లక్ష్మీ నిలయం నాన్‌ ఏసీకి రూ.560, లక్ష్మీనిలయం నాన్‌ ఏసీ డీలక్స్‌ రూ.1000గా నిర్ణయించారు.

బ్రేక్‌ దర్శనం టికెట్లు..

తిరుమల తరహాలో యాదాద్రిలో బ్రేక్‌ దర్శనం టికెట్లను పొందుపరిచారు. ఒక్కోరికి టికెట్‌ ధర రూ.300, రూ.150 శీఘ్రదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందొచ్చు. ఆలయంలో జరిపే వివిధ ఏర్పాట్లకు విరాళమిచ్చేందుకు ఈ డొనేషన్‌ సదుపాయం కల్పించారు. దీన్ని ఈ హుండీ అంటారు. ప్రధానాలయం దివ్యవిమాన గోపురాన్ని స్వర్ణమయం చేసేందుకు ఆన్‌లైన్‌లో వితరణ చేయొచ్చు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుకల్యాణ మహోత్సవం-2023 టికెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ధర రూ.3వేలు, ఈ టికెట్లను ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. ఈ నెల 28న తిరుకల్యాణం జరగనుంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌లో పేరు, పూజ వివరాలు, గోత్రం, మొబైల్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీ, తేదీ, వెల, ఎన్ని టికెట్లు, చిరునామా నింపాలి. ఆప్షనల్‌గా నక్షత్రం, రాశి, ఆధార్‌ నెంబర్‌, వయసు, ఆలయ సందర్శన వేళల వివరాలు నింపాలి.

నిజంనిప్పులాంటిది

Feb 14 2023, 10:56

ముఖ్యమంత్రి కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా

కొడిమ్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ పర్యటన బుధవారానికి వాయిదా పడింది.

స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున

మంగళవారం పర్యటనను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 21:23

CM Jagan: నిర్లక్ష్యం వద్దు.. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకపోతే టికెట్‌ ఇచ్చేది లేదు: సీఎం జగన్‌

అమరావతి: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వెనుకబడిన 30 మంది ఎమ్మెల్యేల(Ysrcp MLAs)పై సీఎం జగన్‌ (CM Jagan) మండిపడ్డారు..

పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదికను సోమవారం ఆయన ప్రదర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తక్కువ రోజులపాటు తిరిగిన పలువురు ఎమ్మెల్యేల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గతంలో హెచ్చరించినా ఇప్పటికీ పనితీరు మెరుగుపరుచుకోని ఎమ్మెల్యేలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం అస్సలు ప్రదర్శించవద్దని హెచ్చరించారు..

మార్చి 18 నుంచి 'మా భవిష్యత్తు నువ్వే జగన్‌' పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈలోగా పార్టీ కన్వీనర్లు, సచివాలయ సమన్వయకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. పలు నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న గృహ సారథులు, కన్వీనర్ల నియామకం పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 18:49

Pawan Kalyan: మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే: పవన్ కల్యాణ్‌..

అమరావతి: తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?..

సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్‌ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు.

''తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా? తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిది.. దొంగతనానికి వచ్చి రేప్‌ చేశారని చెప్పే మంత్రులు గల ప్రభుత్వమిది.. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది? గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారు. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దారుణ ఘటనలపై అన్ని వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉంది'' అని పవన్‌ పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 17:07

Andhra News: జగన్‌ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతించకూడదు?: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ..

అమరావతి: పారిశ్రామికంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌ ఆకర్షిస్తోందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు..

రాష్ట్ర జీఎస్‌డీపీ 11.34 శాతంగా ఉందని.. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ చాలా ముందుందన్నారు. తలసరి ఆదాయం కూడా 38.5 శాతం మేరకు పెరిగిందని చెప్పారు. కొందరు రాష్ట్ర వృద్ధి తిరోగమనంలో ఉందని ప్రచారం చేస్తున్నారని.. అది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.

'2022 జూలై నాటికి ఏపీకి రూ. 40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.1.71 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే అందులో అత్యధిక పెట్టుబడులు ఏపీకే వచ్చాయి. ఈ మేరకు రూ.23,985 కోట్లకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ 5వ స్థానంలో ఉంది. అలయన్స్ టైర్స్ సంస్థ విశాఖలో రూ.1,040 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. రాష్ట్ర పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై దేశీయ, విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. బల్క్ డ్రగ్ పార్కు కోసం రూ.1000 కోట్ల గ్రాంట్ ఏపీ సాధించింది..

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 14:22

పోలీసులపై రాళ్లూ రువ్విన ఎమ్మార్పీఎస్ నాయకులు..

విజయవాడ కానిస్టేబుల్ గా నందిగామ ట్రాఫిక్ లో చేసే తిరుమల్ రావు అనే కానిస్టేబుల్ కు తలకు గాయం

ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) కార్యకర్తలు దిగ్బంధానికి (రాస్తారోకో) పిలుపునిచ్చారు, ఎన్టీఆర్ జిల్లాలో ఆందోళన..

ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు వద్ద ఎమ్మార్పీఎస్ ఆందోళన హింసాత్మకంగా మారింది..

రాళ్ల దాడి మరియు ఒక పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు, తరువాత పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలని ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 13:50

ఎలాగు రాజీనామా చేయ్సాలిందే.. కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

న్యూఢిల్లీ: కేంద్రంపై బురద జల్లేందుకు అసెంబ్లీని వాడుకున్నారని కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత బడ్జెట్‌లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు..

కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్‌ రాష్ట్ర పరిస్థితిపై ఎందుకు మాట్లాడరు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటి? అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

''అసెంబ్లీలో కేసీఆర్‌ పరిధి దాటి మోదీపై మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశాలా? మోదీ విద్వేశ సమావేశాలా?. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి ఏమైంది?. విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడ లేదు. ఆధారాలు లేకుండా కేంద్రంపై ఆరోపణలు చేశారు. కుటుంబ పాలనపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు. దేశ పరిస్థితులపై కేసీఆర్‌కు అవగాహన లేదు'' అంటూ ఆయన దుయ్యబట్టారు..

''దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు మేం సిద్ధం. ప్రగతి భవన్‌ లేదంటే ఫామ్‌హౌజ్‌కు చర్చకు రమ్మంటారా?. అభివృద్ధిపై చర్చకు కేసీఆర్‌ ఎక్కడకు రమ్మన్నా వస్తాం. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని వస్తే రండి. అసలు కేసీఆర్‌ను రాజీనామా ఎవరు అడిగారు?. వచ్చే ఎన్నికల తర్వాత ఎలాగు రాజీనామా చేయ్సాలిందే'' అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు..

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 13:47

GVL Narasimha Rao: కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు వంగవీటి పేరు పెట్టాలి..

GVL Narasimha Rao Demands To Put Vangaveeti Name To Krishna District: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో వంగవీటి మోహనరంగా గురించి ప్రస్తావించారు..

రాజ్యసభ జీరో అవర్లో మాట్లాడిన ఆయన.. వంగవీటి మోహనరంగా గురించి తెలియని తెలుగువారు ఉండరన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఆయన్ను ఆరాధ్య దైవంగా కొలుస్తారన్నారు. అత్యంత పెద్ద సామాజికవర్గమైన కాపులకు చెందిన రంగా.. కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ, గొప్ప ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. అలాంటి రంగాను కొందరు ద్రోహుడు 1986 డిసెంబర్ నెలలో హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు..

రాష్ట్రంలో వంగవీటి రాజకీయ శక్తిగా ఎదుగుతున్న తరుణంలో.. 'కాపునాడు' సభలను నిర్వహిస్తున్న టైంలో ఈ హత్య జరిగిందని గుర్తు చేశారు. లక్షల మంది ప్రజలు, కాపు వర్గం నేతలు వంగవీటిని సమర్థించిన సమయంలో.. ఆయన్ను హతమార్చడం దిగ్భ్రాంతి కలిగించిందని జీవీఎల్ పేర్కొన్నారు. రంగా చనిపోయి 36 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఆయనను ప్రజలు స్మరించుకుంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చిందని తెలియజేశారు. ఇతర నాయకుల పేర్లను జిల్లాలకు పెట్టారు కానీ, కానీ రంగా పేరును మాత్రం పెట్టలేదని తెలిపారు. కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రంగా పేరు పెట్టాలని తాను కేంద్రాన్ని కోరుతున్నానని జీవీఎల్ వెల్లడించారు.

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 13:37

గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్‌ దంపతుల భేటీ..

అమరావతి: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు భేటీ అయ్యారు. ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్లపాటు సేవలందించి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్‌కు సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా సుప్రీకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఏపీతోపాటు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిశ్వభూషన్‌ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లనున్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 11:58

స్టేషన్ బెయిల్ పేరిట కొనసాగుతున్న పోలీసులదందా నూ అరికట్టాలి...!

•కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న డిమాండ్

•పోలీసు అధికారుల నిలువుదోపిడీకీ అడ్డుకట్ట వేయండి

•ప్రజా నేస్తం కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ

•లంచం ఇవ్వకుంటే పోలీసుల'విచక్షణ' అస్త్రం ఇంకెంతకాలం....?

•ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీసిన ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ బోసన్న

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు ఠాణాల్లో స్టేషన్ బెయిళ్ల పేరిట లంచాల వసూళ్ల పర్వం మూడు పువ్వులు ,ఆరు కాయలుగా నిత్యం కొనసాగుతోందనీ సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ ప్రజా నేస్తం కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.

పోలీసులు ఏసీబీకి చిక్కేది ఎక్కువగా ఈ వ్యవహారాల్లోనే కావడం దీన్ని బలపరు స్తోందనీ.. సంఘసంస్కర్త బొసన్న తెలిపారు.

తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరి ధిలోని బేగంపేట ఠాణా పరిధిలో ఒక బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.12 వేలు లంచం తీసుకుంటూ.. ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ నరేశ్ లు అవినీతి నిరోధకశాఖ (అనిశా)కు దొరికిన సంఘటన దేనికి నిదర్శనమని నిరంతరం ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం పాటుపడే ప్రజా నేస్తం కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశమున్న చిన్న కేసుల్లో నిందితుల్ని రిమాండ్కు తరలించవద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 99 శాతం పోలీసు అధి కారులు అనుదినం దుర్వినియోగం చేస్తున్నారనీ .. ప్రజాభ్యుదయవాది జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.

నిందితులు లంచం ఇచ్చేవరకు ఠాణాల చుట్టూ తిప్పు తున్నారనీ ఒక్కో కేసులో రూ.20-వేల నుండి 50 వేల వరకు

వసూలు చేస్తున్నట్లు సామాజిక ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖలో తెలంగాణ రాష్ట్ర పోలీసుల అంతులేని అవినీతి ,అక్రమాల దందపై జననేస్తం సుభాషన్న ఫిర్యాదు చేశారు.. చేయి తడపకుంటే కక్ష సాధింపు చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారని ప్రజా ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కెసిఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పోలీసుల అవినీతిని కెసిఆర్ కు వివరించారు.

ఏడేళ్ల లోపు శిక్ష పడే నేరాల్లో 41 సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) కింద దర్యాప్తు అధి కారికి విచక్షణాధికారం ఉంటుంది. దీని ప్రకారం నిందితుడికి 41ఏ నోటీసు ఇచ్చి సంజాయిషీ అడగవచ్చు. దానికి నిందితుడి సమాధానం సంతృప్తికరంగా ఉందని భావిస్తే అరెస్టు చేయరు. నిందితుడు సాక్ష్యాల్ని తారుమారు చేస్తాడనో లేక విదేశాలకు పారిపోయే అవకాశ ముందనో అధికారి భావిస్తే రిమాండుకు తరలించవచ్చు. ఇది పూర్తిగా దర్యాప్తు అధికారి 'విచక్షణ' మీద ఆధారపడి ఉంటుందనీ... అనుదినం అణగారిన వర్గాల జన స్వరమై ప్రజా సమస్యలపై ప్రతిక్షణం ప్రజాహితం ద్యేయంగా జీవించే ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే దీన్నే కొందరు పోలీసు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారనీ.. పౌర ,ప్రజాతంత్ర హక్కుల ఉద్యమకారుడు

జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

లంచం ఇవ్వకుంటే రిమాండ్కు పంపిస్తామని బెదిరిస్తున్నారనీ, డబ్బులు ఇవ్వలేని బాధితులను పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని శ్రామిక ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా పోరాడే వర్గ పోరాట వాది

జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

డబ్బు ఇస్తే దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరిస్తామని పోలీసులుఆశ చూపుతున్నారనీ.. పోలీసులు అవినీతి ,అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిక్షణం ప్రజాహితం కోసం పాటుపడే ప్రజా నేస్తం, సంఘసంస్కర్త, హేతువాది

జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

నేరాల్లో వాహనాలు ఇరుక్కుపోయి ఉంటే వాటిని తిరిగి ఇచ్చేందుకు మరింత ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనీ... సుభాషన్న పోలీసుల అవినీతిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల దందాపై దళిత బహుజన హక్కుల పోరాట యోధుడు

జైబోరన్నరి నేతాజీ సుభాషన్న ధ్వజమెత్తారు.

పోలీసులకు లంచం వచ్చే అవకాశం లేనప్పుడు.. తప్పుడు కారణాలు చూపి రిమాండ్కు తరలిస్తున్నారనీ... సుభాషన్న తెలిపారు .

తెలంగాణ రాష్ట్రంలో ఏటా 1.3-నుండి 1.4 వరకూ లక్షల కేసులు నమోదవుతున్నాయని భారత్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ అవేర్నెస్ ఆర్ టి ఐ యాక్ట్ ద్వారా

బి .జె. ఆర్ .సర్దార్ పటేల్ సేకరించిన వివరాలను... బాధితుల బంధువు బహుజనుల నేస్తం ,సంఘసంస్కర్త

జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,42,917. అనీ...వీటిలో సుమారు లక్ష కేసులు స్టేషన్ బెయిల్కు అర్హత ఉన్నవేనని మెరుగైన సమాజ నిర్మాణానికి అవసరమైన రాళ్లను తన వంతుగా అందిస్తూ అనుక్షణం అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆరాటపడే అభ్యుదయ వాది

జైబోరాన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసులలో చాలావరకు స్టేషన్ బెల్లకు అర్హత ఉన్నప్పటికీ పోలీసులు మితిమీరిన వసూళ్ల దందాకూ పాల్పడుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండటం సరైన పద్ధతి కాదని ... కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

జిల్లాలతోపాటు కమిషనరేట్లలోనూ స్టేషన్ బెయిళ్ల వ్యవహారాలు చూసేది దాదాపుగా ఎస్సైలే కావడంతో కానిస్టేబుళ్లు లేదా దళారుల ద్వారా వసూళ్లు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసుల దందా పై ప్రజా నేస్తం సుభాషన్న సమాచారం ఇచ్చారు.

కొత్తగా ఉద్యోగాలు వచ్చిన ఇటీవలి బ్యాచ్లకు చెందిన ఎస్సైలు ఇలాంటి వ్యవహారాల్లో ముందుంటున్నారనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజాభ్యుదయ వాది

జైబోరాన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖలో వివరించారు.

ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాల్లో నిందితుడిని రిమాండ్కు తరలించాలా? వద్దా? అనే విచక్షణాధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది. రిమాండ్ చేయని పక్షంలో 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇచ్చి సంజాయిషీ అడగొచ్చు. ఒకరకంగా ఇది బైండోవర్ మాత్రమే. స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారం దర్యాప్తు అధికారులకు లేకపోయినా.. కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనీ పౌర హక్కుల పరిరక్షణ కోసం పాటుపడే ప్రజాతంత్ర ఉద్యమకారుడు

జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్ బెయిల పేరు మీద జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారులను, కానిస్టేబుళ్ళనూ, మధ్య దళారీలను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక ,కర్షక, శ్రామిక స్థాపనకై ఆరాటపడే అభ్యుదయ వాది, కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ, ప్రజా నేస్తం, కామ్రేడ్

జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న

8328277285 రాష్ట్ర ప్రభుత్వంనూ డిమాండ్ చేశారు.